News August 13, 2025

ఖమ్మం నగరంలో డెంగీ పంజా..!

image

ఖమ్మం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క వైరల్ ఫీవర్లు.. మరోపక్క డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభంలోనే 10 కేసులు నమోదయ్యాయి. KMC అధికారులు అప్రమత్తమై 21 హట్ స్పాట్‌లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. సీజనల్ వ్యాధులు అడ్డుకోవాలంటే ప్రజలు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 9, 2026

రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.

News March 9, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.

News March 9, 2026

కామేపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కామేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఊట్కూరుకి చెందిన దుగ్గి సాయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ అఖిల్ పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.