News November 6, 2025

ఖమ్మం: పత్తి మిల్లుల నిరవధిక సమ్మె వాయిదా

image

తెలంగాణలోని కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దీంతో నవంబర్ 6న జరగాల్సిన నిరవధిక బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు టీజీ కాటన్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై కేంద్రానికి లేఖ పంపినట్లు తెలిపింది. 2, 3 రోజుల్లో 75% మిల్లులు ప్రారంభమవుతాయని CCI బ్రాంచ్ మేనేజర్లు చెప్పడంతో.. కొనుగోలు కేంద్రాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.

Similar News

News January 21, 2026

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.

News January 21, 2026

పట్టాదారు పాసు పుస్తకాల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

పరిగి మండలంలో జరుగుతున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల పరిశీలనను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రీ సర్వే పూర్తయిన హుస్సేన్ బి అనే మహిళకు ఈ-కేవైసీ పూర్తి చేసి డ్రాఫ్ట్ పట్టా ప్రతిని ఆమెకు అందజేశారు. పాస్ పుస్తకాల జారీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News January 21, 2026

జగిత్యాల: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి సీతక్క

image

జగిత్యాల జిల్లాలో నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నూతన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, సుపరిపాలనతో వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచులు ప్రజల అవసరాలను గుర్తించి, కేంద్ర, రాష్ట్ర నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన పాలనతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.