News November 30, 2025
ఖమ్మం: 20 ఏళ్లుగా ఎన్నికలకు నోచుకోని వార్డులు

ఏన్కూరు(M) నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉండగా, అందులో 4 వార్డులు STలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే గ్రామంలో ఒక్క ST ఓటరు కూడా లేకపోవడంతో, ఈ 4 వార్డులు దాదాపు 2 దశాబ్దాలుగా ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూడా ఈ వార్డులకు నామినేషన్లు వేసే అవకాశం లేదు. అలాగే సర్పంచి కూడా ST రిజర్వ్ కావడంతో ఉపసర్పంచే సర్పంచిగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News February 17, 2026
అమలాపురం: చదరంగంలో మీ సత్తా చూపండి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ‘షాప్ లీగ్’ చదరంగం పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు మల్టీ స్పోర్ట్స్ లీగ్ నిర్వహిస్తోందని తెలిపారు. 12 నుంచి 20 ఏళ్ల వయసున్న క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన యువతను వెలికితీయడమే లక్ష్యమని కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పేర్కొన్నారు.
News February 17, 2026
నెల్లూరు మేయర్గా మరోసారి మహిళకే ఛాన్స్!

నెల్లూరు మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్ను ఎన్నుకోనున్నారు.
News February 17, 2026
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

నాదెండ్ల – గణపవరం మధ్య నూతన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో, వాహనదారుడు ఎగిరి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించకపోవడమే మరణానికి ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవన్నారు.


