News May 11, 2024

ఖమ్మం: 4గంటలకే ప్రచారం బంద్ 

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఈరోజు సా.4 గంటలకే ప్రచారం ముగియనుంది. మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా.4 గంటలకే ప్రచారం ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 

Similar News

News February 19, 2025

కొత్తగూడెం: వివాహేతర సంబంధం.. ఇద్దరికి దేహశుద్ధి..!

image

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఖమ్మంపాడుకు చెందిన మరో వ్యక్తిని మంగళవారం సాయంత్రం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశామని ఖమ్మంపాడు గ్రామస్థులు తెలిపారు. ఖమ్మంపాడులోని ఓ వివాహితతో గాండ్లగూడెం వాసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని,ఆమె కుటుంబ సభ్యులు గమనించగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశామని చెప్పారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

News February 19, 2025

ఖమ్మం: ‘యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు’ 

image

ఖమ్మం జిల్లా పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీకి చెందిన యువతిని అదే కాలనీకి చెందిన సంగాల నరసింహారావు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని వీరనారీమణుల ఆశయ సాధన సమితి సభ్యులు ఆరోపించారు. రఘునాథపాలెంలో సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి, జిల్లా కార్యదర్శి స్పందనను బాధితురాలు మంగళవారం కలిసింది. ఈ మేరకు ఉపేంద్రబాయి మాట్లాడుతూ.. పోలీసులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

News February 19, 2025

ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య

image

అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!