News April 13, 2024
గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం : వేములవాడ డీఎస్పీ

గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం మోపుతానని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి అన్నారు. శనివారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదుగురు గంజాయి నిందితులను అరెస్ట్ చేయగా వారి వద్ద రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని డిఎస్పి అన్నారు.
Similar News
News December 11, 2025
కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.
News December 11, 2025
గంగాధర: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
News December 11, 2025
కరీంనగర్: ఆ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి- కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు. ఈ సెలవును దుకాణాలు, సంస్థల చట్టం 1988, సెక్షన్ 13 ప్రకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


