News November 7, 2025

గచ్చిబౌలి: ఫుడ్ ప్రాసెసింగ్‌పై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్

image

గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్ జరిగింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పెట్టుబడులు లాభసాటిగా ఉన్నాయని, రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా FPUD డైరెక్టర్ సింగనాద్ జూరీ తెలిపారు.

Similar News

News January 19, 2026

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్‌వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారు.

News January 19, 2026

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల

image

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నారు. ‘స్వనితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన “ది మెరిడియన్ కలెక్టివ్” కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, సుస్థిర లక్ష్యాలపై ఈ సదస్సులో ఆయన చర్చించనున్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రగతిని చాటిచెప్పేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఎంపీ కార్యాలయం తెలిపింది.

News January 19, 2026

మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

image

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.