News January 27, 2025
గజ్వేల్: BRS చేసిందేమీ లేదు: శ్రీకాంత్ రావు

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2025 సంవత్సరాన్ని గేమ్ ఛేంజర్గా మార్చేలా రేవంత్ అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదేనని, యువతకు ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.
Similar News
News February 15, 2025
వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై ఏర్పాటు చేశారు.
News February 15, 2025
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భువనగిరి కలెక్టర్

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
News February 15, 2025
మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.