News March 16, 2025
గద్వాలలో వ్యక్తి మృతి

ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడు వైపునకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News February 12, 2026
నెల్లూరు: ఆ రెండూ పార్టీలు ఎక్కడ..?

TDP, జనసేన, BJP కలిసి కూటమిగా ఏర్పడినా ఆ రెండు పార్టీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా మారుతోంది. కూటమిలో జనసేన, BJPలతో టీడీపీ సఖ్యతతో నడవడం లేదంట. జనసేనలో నాయకత్వ పగ్గాలు మోసే వారు కరవయ్యారు. యాక్టీవ్గా ఉన్న నేతలు ఇప్పటికే సైడ్ అయిపోయారు. తమకు కూటమితో సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పాత పద్ధతిలోనే పోరాడుతోంది. జిల్లాలో 3 పార్టీలదీ తలో దారి అన్నట్టుగా మారింది.
News February 12, 2026
దోసలో బోరాన్ లోప లక్షణాలను ఇలా గుర్తించండి

దోస పంటలో బోరాన్ లోపం వల్ల ఆకులు మందంగా మారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి, ఆకులు చిన్నవిగా, ముడుచుకొని, పసుపు రంగులో కనిపిస్తాయి. ఎదిగే లేత కొనలు ఎండిపోతాయి. ఆడ పువ్వుల సంఖ్య తగ్గి మగ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. కాయ లోపలి భాగం లేత పసుపురంగులోకి మారుతుంది. కాయలపైన తొక్క దళసరిగా మందంగా మారడంతో పాటు బొడిపెలు కనిపిస్తాయి. బోరాన్ లోప ఉద్ధృతి ఎక్కువైతే కాయలు నిలువుగా పగులుతాయి.
News February 12, 2026
ఆధార్లో ఇంటి అడ్రస్ను ఈజీగా మార్చుకోండి!

ఇల్లు మారినప్పుడల్లా అడ్రస్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ఆధార్ మొబైల్ <<18981041>>యాప్<<>> ద్వారా మీ హౌస్ అడ్రస్ను సులభంగా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే సరిపోతుంది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే సులభంగా, వేగంగా ఈ సేవను పొందొచ్చు. యూజర్లు ₹75+GST చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. SHARE IT


