News August 13, 2025

గద్వాల: ఉప్పొంగుతున్న వాగులు.. ప్రవాహాలు దాటవద్దు

image

గద్వాల జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన బీచుపల్లి పుష్కర ఘాట్‌తో పాటు ఇతర వాగులను పరిశీలించారు. వాగుల వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు.

Similar News

News March 9, 2026

నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

image

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.

News March 9, 2026

పాలమూరు: ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

image

MBNRలోని రాజేంద్రనగర్‌లో DDU-GKY & స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవికుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామని, ఈనెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 99496 98592కు సంప్రదించాలన్నారు.
SHARE IT

News March 9, 2026

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.