News December 1, 2025

గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

image

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: రామాయంపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

రామాయంపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

గద్వాల: మున్సిపల్ పోరులో ‘హంగ్’.. ఛైర్మన్ పీఠం ఎవరికి?

image

గద్వాల మున్సిపాలిటీలో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మొత్తం 37 వార్డుల్లో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 7, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. మేజిక్ ఫిగర్ 19 కాగా, అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ మరో నలుగురి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే, వ్యూహాత్మకంగా బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపితే (12+7=19) సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

News February 13, 2026

సామాన్య భక్తురాలిగా నంద్యాల కలెక్టర్ దర్శనం

image

శ్రీశైల క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారం సాధారణ భక్తురాలిగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత క్యూ లైన్ నుంచి వెళ్లి 20 నిమిషాల్లోనే దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.