News March 25, 2024
గద్వాల జిల్లాకు పొంచి ఉన్న తాగునీటి గండం

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో జోగుళాంబ గద్వాల జిల్లాకు తాగునీటి గండం పొంచి ఉందని చెప్పొచ్చు. ఈ ఏడాది కృష్ణాబేసిన్లో వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టులలో తగినన్ని నీటి నిల్వలు లేవు. దీంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా.. రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ రోజు రోజుకు మండుతున్న ఎండలకు జూరాలలోని నీటి నిల్వలు పడిపోతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
Similar News
News December 12, 2025
MBNR : భూత్పూర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
News December 12, 2025
MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
మహబూబ్నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.


