News December 2, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News February 18, 2026
వెంటిలేటర్పై సల్మాన్ ఖాన్ తండ్రి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.
News February 18, 2026
2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.


