News December 2, 2025

గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

image

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.

Similar News

News February 18, 2026

కామారెడ్డి జిల్లాలో స్థిరంగా ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎల్పుగొండ, రామలక్ష్మణపల్లి 15°C, జుక్కల్ 15.1, గాంధారి, మేనూర్ 15.3, లచ్చపేట 15.6, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 15.8, పెద్దకొడప్గల్ 15.9, రామారెడ్డి 16, బిచ్కుంద 16.2, ఇసాయిపేట, డోంగ్లి 16.3, సర్వాపూర్ 16.4, పాత రాజంపేట 16.5, నస్రుల్లాబాద్ 16.8°C లుగా నమోదయ్యాయి.

News February 18, 2026

BREAKING: రూ.5వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా సిల్వర్ రేటు మాత్రం తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,200, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,41,350గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 18, 2026

చిత్తూరు DMHOగా డా.నాగశశి భూషణ్ రెడ్డి

image

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.