News August 13, 2025
గద్వాల: తాను చనిపోతూ.. ఆరుగురికి జీవం పోసింది

ఉండవెల్లి(M) బొంకూర్కి చెందిన నర్సబాయ్ బాత్రూంలో జారిపడి తలకు తీవ్ర గాయమైంది. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. నర్సబాయ్ అవయవాలను ఆరుగురికి దానంచేసి వారికి ప్రాణదానం చేశారు. ఆమె గొప్ప మనసుకు గుర్తుగా గ్రామస్థులు అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు.
# నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం
Similar News
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News March 11, 2026
సూర్యాపేట: కొత్త పింఛన్లు ఇంకెప్పుడు..!

సూర్యాపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై స్పష్టత లేదు. పాత పింఛన్లు ఆగిపోతున్నాయే తప్ప, అర్హులైన కొత్తవారికి మాత్రం ఊరట లభించడం లేదు. పేదలు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
News March 11, 2026
TG గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్లో తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.


