News March 31, 2024
గద్వాల: పోస్టల్ దరఖాస్తుకు ఏప్రిల్ 23 వరకు గడువు

ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న అధికారులు, పోలింగ్ రోజున ఓటు వేసే అవకాశం లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఏప్రిల్ 23లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆర్డీవో రామచందర్, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News February 16, 2026
పాలమూరు: నేడు ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఇదే!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో నేడు జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.
News February 16, 2026
పాలమూరు మేయర్ పీఠానికి ఫుల్ డిమాండ్!

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, పార్టీ సీనియర్ నేత సిరాజ్ ఖాద్రి సతీమణి హజీరాబేగం, ఏకగ్రీవంగా ఎంపికైన రమ శ్రీనివాసరాజు మేయర్ పీఠానికి పోటీపడుతున్నారు. మేయర్ ఎంపిక విషయంలో నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే అయినప్పటికీని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
News February 15, 2026
మన్యంకొండలో శేష వాహన సేవ

మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.


