News September 10, 2025

గద్వాల: సైబర్ ఉచ్చు.. చదువుకున్నవారే బలైపోతున్నారు!

image

పని చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నవారు సైబర్ మోసగాళ్లకు సులభ లక్ష్యాలు అవుతున్నారు. తాజాగా గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వాసి ట్రేడింగ్‌లో లాభాల పేరుతో రూ.22 లక్షలు, వడ్డేపల్లి వాసి రూ.8 లక్షలు కోల్పోయారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారని పోలీసులే చెబుతున్నారు. విశ్వసనీయత లేకుండా అనుమానాస్పద యాప్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టడం.. తమకు తెలియకుండానే మోసాలకు బలవుతున్నారు.

Similar News

News December 10, 2025

బ్లాక్ మెయిల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DEO

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్‌కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.

News December 10, 2025

సంగారెడ్డిలో 1100 మందితో ఎన్నికల బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఏడు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1,100 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరీతోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News December 10, 2025

మీరు గెలిస్తే ప్రజల తీర్పు.. మేం గెలిస్తే ఓట్ చోరీనా?: కలిశెట్టి

image

AP: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై YCP MP మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడిన తీరు హాస్యాస్పదమని TDP MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ‘ఓట్ చోరీ‌పై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విజయనగరం, చిత్తూరు, హిందూపూర్‌లో ఓట్ల చోరీ జరిగినట్టు ఆయన చెప్పారు. YCP గెలిచినప్పుడు ప్రజాస్వామ్య తీర్పు అన్నారు. మేం గెలిస్తే ఓట్ చోరీ అంటున్నారు. YCP హయాంలో పలు ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారు’ అని మండిపడ్డారు.