News December 2, 2025

గద్వాల: సైబర్ నేరాలపై అవగాహన ప్రచారం: ఎస్పీ

image

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత పౌరుని హక్కు అని ఆయన అన్నారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ అవగాహన శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

Similar News

News February 19, 2026

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 19, 2026

ప్రతి జిల్లా కాంప్లెక్స్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

image

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్ర కార్యాలయ భవనాల కాంప్లెక్సుల్లో వీటి ఏర్పాటుకు రూ.5.80 కోట్ల విడుదలకు పాలనా అనుమతి జారీచేసింది.

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.