News March 5, 2025

గరుగుబిల్లిలో వ్యక్తి ఆత్మహత్య

image

గరుగుబిల్లి మండలానికి చెందిన నాగల్ల సింహాచలం( 56) ఆత్మహత్య చేసుకున్నట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. ఎస్ఐ కథనం.. మృతుడు గొర్రెల కాపరి. తన కుమారుని వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో మనస్తాపంతో మంగళవారం కొమరాడ మండలం గుమడ గ్రామ దరి గొర్రెల మంద విషం తాగి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 25, 2025

SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

image

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8మంది టన్నెల్‌లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

News March 25, 2025

SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

image

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.

News March 25, 2025

నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

image

TG: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని తెలిపారు. ‘సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించా. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!