News May 2, 2024
గరుగుబిల్లి: కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం వెళ్లిన భక్తులు ఈ పరిస్థితుల్లో మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారి వెంట ఉంటుందని పేర్కొన్నారు.
News December 6, 2025
VZM: వెనుకబడ్డ మండలాలపై కలెక్టర్ అసహనం

100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస, తదితర మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు.
News December 5, 2025
1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.


