News August 14, 2025

గాంధీ భవన్‌లో ‘రాజీవ్ జ్యోతి’కి ఘన స్వాగతం

image

ఏటా పెరంబదూర్ నుంచి ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి నాటికి ఢిల్లీకి చేరుకునేలా చేపట్టే రాజీవ్ జ్యోతి యాత్ర ఈ రోజు HYDకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచన మేరకు యాత్రకు గాంధీ భవన్‌లో స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్, నాంపల్లి ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ ఉన్నారు.

Similar News

News March 9, 2026

HYD: CITD డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్

image

బాలానగర్‌లోని కేంద్ర టూల్ డిజైనింగ్(CITD) విద్యాసంస్థ డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించింది. కనీసం 10వ తరగతి పాసైన విద్యార్థులు, ఈ కోర్సులు చేయడానికి అర్హులు. టూల్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కోర్సులు ఇందులో ఉన్నాయి. ఒక్కో కోర్సు 3 ఏళ్లు. అప్లికేషన్స్ స్వీకరణ ప్రారంభమైందని, మే 22 వరకు tinyurl.com/citddiploma2026 ద్వారా దరఖాస్తు చేసుకోండి.

News March 8, 2026

రూ.5,812 కోట్లతో మూసీ నది ప్రాజెక్టు ఫేస్-1

image

రూ.5,812 కోట్లతో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఫేస్-1 పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.73.8 కోట్లు వెచ్చించనట్లు తెలిపారు. గాంధీ విగ్రహ వేదికకు రూ.22.6 కోట్లు, మ్యూజియం, భవనానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.79 కోట్లతో ఎలక్ట్రో-మెకానికల్ పనులు చేపట్టనున్నారు.

News March 8, 2026

HYD: యూట్యూబ్ చూసి డాలర్లలో సంపాదన!

image

HYD శివార్లలోని బాచుపల్లి, నిజాంపేట్ బస్తీల్లో ఇప్పుడు సీన్ మారింది. కుర్రాళ్లు సాయంత్రం అయితే చాలు కిరాణా కొట్టుల దగ్గర కూర్చుని ‘పైథాన్’ కోడింగ్ చిక్కుముడులు విప్పుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఆఫీసుల ఏసీ గదుల కంటే గల్లీలోని వేపచెట్టు కింద కూర్చుని విదేశీ క్లయింట్లకు ప్రాజెక్టులు చేసివ్వడమే వీరి స్టైల్. ఏ డిగ్రీలు లేకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకున్న విద్యతో డాలర్లు సంపాదిస్తున్నారు.