News April 2, 2024
గిద్దలూరు: జనసేన పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్ఛార్జ్గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News February 17, 2026
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.
News February 17, 2026
CDPOలతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష.!

అంగన్వాడీల్లోని చిన్నారుల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా దృష్టి సారించాలని సీడీపీఓలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వయసుకు తగినట్లుగా పిల్లల బరువు, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News February 17, 2026
ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.


