News March 19, 2024
గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News December 5, 2025
GNT: ఒక్క రోజు మీకు ఇస్తే.. మీ ప్రాధాన్యత ఏంటి.?

గుంటూరు జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. గుంతల రోడ్లు, పొంగే డ్రైనేజీలు, తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ నరకం.. జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. మరి మీకు ఒక్కరోజు సమస్య పరిష్కరించే అధికారం దక్కితే.. వీటిలో ఏ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారు? మీ ప్రాధాన్యత ఏంటి? రోడ్లా? నీళ్లా? డ్రైనేజీనా? మీ మనసులో మాట చెప్పండి! ఈ ఒక్కరోజు ఛాన్స్ మీకైతే.. పట్టణ రూపురేఖలు ఎలా మారుస్తారు? కామెంట్ చేయండి.
News December 5, 2025
ఈ నెల 8 నుంచి ANU యువజన ఉత్సవాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


