News August 13, 2025
గుంటూరు చరిత్రలో మర్చిపోలేని PHOTO ఇది

బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.
Similar News
News March 17, 2026
మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.
News March 17, 2026
మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు గట్టి కృషి చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
News March 17, 2026
GNT-VJA ప్రయాణానికి కొత్త యూటర్న్ మార్గం

గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలకు కొత్త మార్గం అమల్లోకి రానుంది. బైపాస్ను ప్రధాన హైవేతో కలిపిన తర్వాత నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. కాజా టోల్ దాటి మురుగన్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లాలి. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి హైల్యాండ్ వద్ద యూటర్న్ తీసుకొని మళ్లీ హైవేలో చేరాలి. ఈ మార్గానికి సంబంధించిన రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.


