News April 25, 2024

గుంటూరు: జిల్లాలో ఎన్నికల పరిశీలకుల పర్యటన 

image

ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజాన్ సింగ్ బుధవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాకు విచ్చేసిన వారికి కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ఆరా తీశారు. 

Similar News

News April 15, 2026

నేడు అమరావతికి సీఎం.. షెడ్యూల్ ఇదే..!

image

పల్నాడు(D) అమరావతిలో CM చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ధరణికోటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకుంటారు. 2:15కు అన్న క్యాంటీన్ ప్రారంభించి లబ్ధిదారులతో CM భోజనం చేయనున్నారు. తిరిగి 2:45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News April 15, 2026

GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్‌పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

News April 15, 2026

అంబటికి పోలీసుల నోటీసులు

image

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.