News April 27, 2024

గుంటూరు: జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో తాడికొండ నియోజకవర్గ పరిధిలో కారులో తీసుకెళ్తున్న సరైన పత్రాలు చూపని రూ.1.50లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,44,57,165ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. 

Similar News

News April 12, 2026

GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

image

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 12, 2026

ఇక ఆన్‌లైన్‌లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 12, 2026

ఇక ఆన్‌లైన్‌లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.