News October 5, 2025

గుంటూరు జిల్లాలో 524 మంది మహిళలు అదృశ్యం.!

image

గుంటూరు జిల్లాలో 2023లో అత్యాచార ఘటనలు, అదృశ్యమైన కేసులు, రోడ్డు ప్రమాదాల జాబితాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 34 మంది మహిళలపై అత్యాచారం, 524 మంది మహిళలు, 290 మంది పురుషులు అదృశ్యం. 26 మంది చిన్నారుల అపహరణ, 336 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి, సైబర్ నేరాలు 287, ఎస్సీ, ఎస్టీ కేసులు 99, 27 మంది ఆత్యహత్యలకు పాల్పడగా అందులో 20 మంది మహిళలే ఉన్నారు. వరకట్న వేధింపులతో ఇద్దరు చనిపోయారు.

Similar News

News January 23, 2026

బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

image

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్ర‌భావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మ‌న్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీత‌ల పానీయాలు, ఎన‌ర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బ‌ర్గ‌ర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 23, 2026

ఏలూరులో గోదావరి పుష్కరాలపై కలెక్టర్ కీలక సమీక్ష

image

రామన్న గోదావరి పుష్కరాల్లో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నారు.

News January 23, 2026

NRPT: ‘ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం’

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నారాయణపేట, మద్దూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్వో, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియతో మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు అన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని అన్నారు.