News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

Similar News

News December 14, 2025

కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమ ఏర్పాట్లపై SP పరిశీలన

image

మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఈ నెల 16న నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే మార్గాలు, వేదిక నిర్మాణం, కేడింగ్, వాహనాల పార్కింగ్, వీఐపీ రాకపోకలు, అభ్యర్థుల ప్రవేశ-నిష్క్రమణ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

News December 13, 2025

GNT: జాతీయ లోక్ అదాలత్‌లో 23,466 కేసుల పరిష్కారం

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఒకేరోజు 23,466 కేసులు పరిష్కారం అయ్యాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో 17 బెంచీలతో కలిపి, జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో 1,376 సివిల్, 21,415 క్రిమినల్, 578 చెక్ బౌన్స్, 97 ప్రీలిటికేషన్ కేసులలో రూ.57,68,57,572 ఇప్పించారు.

News December 13, 2025

మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు: పెమ్మసాని

image

మహిళల్లో మౌనం బలహీనతగా మారిపోకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, డీఆర్‌డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించిన ‘లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం’ నయీ చేతన 4.0లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.