News November 19, 2025
గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.
Similar News
News January 24, 2026
ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.


