News August 11, 2025
గుంటూరు: దిగివస్తున్న పచ్చిమిర్చి ధర

మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. పది రోజుల క్రితం వరకు కిలో పచ్చిమిర్చి రూ.75 నుంచి రూ.80 వరకు ధర పలికాయి. రిటైల్ మార్కెట్ తోపాటు రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. వంటింట్లో నిత్యావసరమైన మిర్చి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా రైతు బజార్లో కిలో పచ్చిమిర్చి రూ.46, రిటైల్ మార్కెట్లో రూ.50 గా ఉంది. ధరలు క్రమంగా తగ్గటం కొంత ఊరటనిస్తోంది.
Similar News
News March 11, 2026
టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్లు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.
News March 11, 2026
కామారెడ్డి: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో 739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు అదనంగా అదనపు డిపార్ట్మెంట్ అధికారులు ఏడుగురిని నియమించారు. 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
News March 11, 2026
NLC ఇండియా లిమిటెడ్లో 16 పోస్టులు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ 16 హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్స్పెక్టర్)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.


