News August 28, 2024
గుంటూరు: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ క్యాబినెట్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ భర్తీకి క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖలో 2,771 కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News February 11, 2025
గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 11, 2025
వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
News February 11, 2025
ఎన్టీఆర్: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.