News April 1, 2024

గుంటూరు: నూర్పిడి యంత్రంలో పడి కూలీ మృతి

image

కాకుమాను మండలంలోని వల్లూరులో ఓ వ్యవసాయ కూలీ నూర్పిడి యంత్రంలో పడి మృతి చెందాడు. వట్టిచెరుకూరు మండలం కారంపూడి పాడుకు చెందిన నరసింహ (20) కూలీ పనుల నిమిత్తం వల్లూరు వచ్చాడు. ఆదివారం నూర్పిడి యంత్రంలో కోత కోసిన శనగ పంట వేస్తుండగా పొరపాటున లోపలికి పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే అతన్ని పైకి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 13, 2026

GNT: టిప్పర్ ఢీకొని స్పాట్ డెడ్.. అవయవాలు నుజ్జునుజ్జు!

image

గుంటూరు అమరావతి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెకానిక్ షాప్‌లో పనిచేసే యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ లారీ అతణ్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ టైర్లు ఎక్కడంతో ఆ యువకుడి శరీరం నుజ్జునుజ్జై ఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 13, 2026

GNT: రాజధాని రైతులకు ముఖ్య గమనిక

image

రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” శనివారం అనగా ఫిబ్రవరి 14న రద్దు చేస్తున్నట్లు CRDA అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ కారణాల రీత్యా రేపు గ్రీవెన్స్ డే జరగదని, రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News February 13, 2026

GNT: అధ్యాపకుల గైర్హాజరు.. నోటీసులకు కలెక్టర్ ఆదేశాలు

image

చేబ్రోలు డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రత అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హారైన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.