News November 19, 2025
గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ), ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున, జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఇవ్వడానికి కలెక్టరేట్కు రావచ్చని కలెక్టర్ కోరారు.
Similar News
News January 24, 2026
MNCL: కాజీపేట వరకే సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు

భద్రాచలం రోడ్-బల్లార్షా మధ్య నడిచే 17033/17034 సింగరేణి ఎక్స్ప్రెస్ మెమో రైలు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పూర్తి స్థాయిలో కాకుండా, కాజీపేట వరకు నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు. మందమర్రిలో 3వ లైన్ పనులు, ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో ఈ మార్పు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ రైళ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత రైలు యధావిధిగా నడవనుందన్నారు.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 24, 2026
విజయవాడలో లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డ VRO

విజయవాడలోని 232వ సచివాలయంలో ACB DSP సుబ్బారావు ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో VRO వెంకటేశ్ రూ. 45 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు రవి కుమార్ ACB అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో శుక్రవారం ACB అధికారులు 232వ సచివాలయంపై మెరుపు దాడి చేశారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వనీయ సమాచారం.


