News June 18, 2024
గూడూరు-రేణిగుంట 3వ రైల్వేలైనుకు గ్రీన్ సిగ్నల్

గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ప్రధానమంత్రి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉండగా ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ లైన్ పూర్తయితే గూడూరు నుంచి రేణిగుంటకు తక్కువ సమయంలో చేరొచ్చు.
Similar News
News January 13, 2026
మరో 4 సహకార బ్యాంకులు : CEO శ్రీనివాసరావు

కేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరో 4 సహకార బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయని సొసైటీ CEO శ్రీనివాసరావు Way2Newsతో తెలిపారు. ఇప్పటికే 23 ఉండగా నూతనంగా 4 బ్యాంకులను ఇందుకూరుపేట, నెల్లూరు(R)లో కాకుపల్లి, కొత్తూరు, డక్కిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తామని వెల్లడించారు. తమ బ్యాంకు పరిధిలో ఈ ఏడాది రూ.2900 కోట్ల వ్యాపార లక్ష్యానికి రూ.2250 కోట్లకు చేరువయ్యామని తెలిపారు.
News January 13, 2026
లక్ష్యానికి దూరంగా సూక్ష్మ సేద్యం..!

సూక్ష్మ సేద్య పథకం కింద అందాల్సిన డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు రైతుల దరిచేరడంలో నీరుగారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు 6 వేల హెక్టర్లకు రాయితీపై మంజూరు చేయాల్సి ఉండగా.. 2314.82 హెక్టర్లకు 1767 మంది రైతులకు అందజేశారు. గతేడాది సైతం 5 వేల హెక్టర్లకు 4553 హెక్టార్లకు 3700 మందికి ఈ యూనిట్లను ఇచ్చారు. కాగా మరో 2 నెలల్లో ఆర్ధిక ఏడాది ముగుస్తున్నా.. లక్ష్యాలను సాధించకపోవడం APMIP శాఖ పనితీరు అద్దం పడుతోంది.
News January 13, 2026
నెల్లూరు: రూ.200 కోట్ల రుణ ‘సహకారం’

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.


