News August 9, 2024

గూడూరు: KG నిమ్మ రూ.130

image

గూడూరు నిమ్మ మార్కెట్‌లో నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. గత 4 రోజులుగా అత్యధికంగా రూ.90 నుంచి రూ.100 పలికాయి. గురువారం రూ.100పైగా అమ్ముడుపోవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. బస్తా లూజు మొదటి రకం KG రూ.100 నుంచి రూ.130 చొప్పున, రెండో రకం KG రూ.60 నుంచి రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. శ్రావణమాసంలో దక్షిణ ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేయడంతో నిమ్మధరలు పెరిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 5, 2025

నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

image

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

News December 5, 2025

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

image

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.