News March 11, 2025
గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.
Similar News
News January 23, 2026
కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్వేర్తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 23, 2026
ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 25, 27న పరీక్షలు: DEO

గూడూరులోని SPS UP స్కూల్లో ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 25, 27వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి తమ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు తిరుపతిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News January 23, 2026
నెల్లూరు GGHలో శవాలను తినే రాబందులు!

నెల్లూరు GGHలో కొందరు డాక్టర్లు శవాలపై సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెడ్బాడీలకు పోస్ట్మార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఓ SIని సైతం లంచం డిమాండ్ చేయడం విస్తుపోయేలా చేస్తోంది. కొత్తవంగల్లులో 3ఏళ్ల క్రితం సుశీలమ్మ మరణించింది. ఇటీవల హత్య అని తేలడంతో SI రీపోస్టుమార్టం కోసం GGHకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశారట. ఆయన దీనిపై ఫిర్యాదు చేసినట్లు అధికారులకు తెలుస్తోంది.


