News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Similar News
News February 7, 2026
పెళ్లిళ్లలో సంగీతం వాయించేవాడిని: అనిరుధ్

ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన చిన్నతనంలో పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించేవారు. అప్పుడు తనకు రూ.500 ఇచ్చేవారని, కొన్నిసార్లు తాంబూలం ఇచ్చి పంపేవారని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘ఆ తక్కువ డబ్బుతో పొందిన సంతోషం ఇప్పుడు రూ.కోట్లు వస్తున్నా కలగడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడే తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరానికి చేరవచ్చని అనిరుధ్ నిరూపించారు.
News February 7, 2026
వంటింటి చిట్కాలు

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
News February 7, 2026
మలేషియాకు బయలుదేరిన మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.


