News January 10, 2026
‘గోదావరి’ఖనిలో రెండో మహా జాతర..!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ (జనగామ) శివారులోని గోదావరి నది తీరాన వెలిసిన శ్రీ సమ్మక్క- సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో మాఘ శుద్ధ పౌర్ణమిలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు ఉమ్మడి KNR, ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
Similar News
News January 20, 2026
సంగారెడ్డి: 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు గైర్హాజర్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.
News January 20, 2026
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
News January 20, 2026
చిత్తూరు: మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?

జిల్లాలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.1.72 కోట్ల బకాయిలు విడుదల చేసింది. 973 మందికి సబ్సిడీ కింద రావాల్సిన రూ.1,64,83,589 ప్రభుత్వం వారి వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. దీంతో పాటు నాన్ ఫార్మింగ్ సెక్టార్ కింద పట్టుశాఖకు అనుసంధానంగా చేపట్టిన పనులకు గాను రూ.7,31,800 నిధులు పట్టు పరిశ్రమ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.


