News November 7, 2025
గోదావరిఖని: త్వరలో 473 మందికి కారుణ్య ఉత్తర్వులు

సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటి వరకు కారుణ్య నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది అభ్యర్థులకు ఈనెల 12న కొత్తగూడెం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై తాము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరుగనుందని తెలిపారు.
Similar News
News January 21, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.
News January 21, 2026
SRPT: కందులకు రూ.8వేలు మద్దతు ధర: అదనపు కలెక్టర్

నాణ్యమైన కందులకు క్వింటాకు రూ.8,000 మద్దతు ధర చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ సీతారామరావు తెలిపారు. బుధవారం సూర్యాపేట డాక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లలో త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. రైతులు 12 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
News January 21, 2026
NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.


