News August 21, 2025
గోదావరి ఉద్ధృతికి అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం MP

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగి.. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరిందన్న విషయం తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
Similar News
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
News January 19, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీ మేరకు సోమవారం నెం.07479/78 అనకాపల్లి- చర్లపల్లి మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఈరోజు అర్ధరాత్రి 3.08కి కైకలూరు, 3.40కి గుడివాడ, ఉదయం 4.40కి విజయవాడ, ఉదయం 11.30కి చర్లపల్లి చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.
News January 19, 2026
KNR: సబ్ లీజు’ దందా.. విద్యాశాఖ పట్టించుకోవట్లే!

KNR ప్రకాష్ గంజ్ హై స్కూల్ దుకాణ సముదాయాల్లో లీజు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లీజుదారులు 21 దుకాణాలకు గాను ఒక్కో షాపుకు రూ.వెయ్యి చొప్పున విద్యాశాఖకు చెల్లిస్తూ రూ.20 వేలకు సబ్ లీజుదారుల నుంచి వసూలు చేస్తున్నారని, ముగ్గురు లీజుదారులు ప్రముఖ వ్యాపారులకు అగ్రిమెంట్ పద్ధతిలో ఏకంగా అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ ఈ అక్రమాలకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


