News March 26, 2024

గోవా క్యాంపు నుంచి ప్రజా ప్రతినిధుల తిరుగుముఖం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.

Similar News

News February 13, 2026

నేడే మహబూబ్‌నగర్ కౌంటింగ్!

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పాలమూరు వర్సిటీలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 12, 2026

MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

image

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

News February 12, 2026

MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

image

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.