News March 14, 2025
ఘంటసాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది. బొలెరోలో ఉన్న ఇద్దరు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి వివరాలు నమోదు చేసుకొని సహాయక చర్యలు చేపట్టారు. బొలెరో వాహనం నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Similar News
News February 19, 2026
NGKL: డీఈవోతో ఉపాధ్యాయ సంఘం నాయకుల చర్చలు సఫలం

నాగర్ కర్నూల్ జిల్లా డిఈవో రమేష్ కుమార్ను పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి బుధవారం కలిశారు. వేసవిలో జరిగిన శిక్షణ కార్యక్రమాల ఈయల్స్, ఎన్నికల డ్యూటీ సీసీఎల్ను ఇవ్వాలని కోరారు. డీఈవో స్పందించి ఈయల్స్ ప్రొసీడింగ్స్ అందించారని, సీసీఎల్ ఫైల్ కలెక్టర్ ఆమోదం పొందగానే అందజేస్తామని తెలిపినట్లు సంఘం నాయకులకు తెలిపారు.
News February 19, 2026
NGKL: డీఈవోతో ఉపాధ్యాయ సంఘం నాయకుల చర్చలు సఫలం

నాగర్ కర్నూల్ జిల్లా డిఈవో రమేష్ కుమార్ను పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి బుధవారం కలిశారు. వేసవిలో జరిగిన శిక్షణ కార్యక్రమాల ఈయల్స్, ఎన్నికల డ్యూటీ సీసీఎల్ను ఇవ్వాలని కోరారు. డీఈవో స్పందించి ఈయల్స్ ప్రొసీడింగ్స్ అందించారని, సీసీఎల్ ఫైల్ కలెక్టర్ ఆమోదం పొందగానే అందజేస్తామని తెలిపినట్లు సంఘం నాయకులకు తెలిపారు.
News February 19, 2026
ఉత్కంఠ పోరు.. భారత్ విజయం

T20WC: నెదర్లాండ్స్పై జరిగిన మ్యాచులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్ ఇండియా 20 ఓవర్లలో 193/6 రన్స్ చేయగా నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 18 రన్స్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.


