News December 1, 2025
చందుర్తి : ఎంపీడీవో కార్యాలయాలు, చెక్పోస్టుల తనిఖీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ సోమవారం పలు ఎంపీడీవో కార్యాలయాలు, ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఆయన రుద్రంగి ఎంపీడీవో కార్యాలయం, చెక్పోస్టులను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించి, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News February 17, 2026
ADB: హంగ్ మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఇన్ఛార్జుల నియామకం

ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నికలు వాయిదా పడ్డ మూడు మున్సిపాలిటీలకు TPCC అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్, MLA కే. సత్యనారాయణను, ఖానాపూర్కు MLAలు శ్రీనివాస్, భూపతిరెడ్డిని, కాగజ్ నగర్కు ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, MLA కే.ప్రేంసాగర్ రావును నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 17, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


