News April 13, 2025
చాట్రాయి: ఉరేసుకొని మృతి చెందిన ఫార్మసీ విద్యార్థిని

చాట్రాయిలో తల్లిదండ్రులు మందలించినందుకు 1st ఇయర్ డీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకొని మృతి చెందిందని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. చాట్రాయికి చెందిన శ్రీనివాసరావు- జ్యోతి దంపతుల కుమార్తె ప్రవళిక. కుమార్తె తరచూ ఫోన్ చూస్తుందని తల్లిదండ్రులు మందలించారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవళిక ఉరేసుకొని మృతి చెందింది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
Similar News
News January 23, 2026
బ్రెజిల్తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.
News January 23, 2026
ప.గో: వైద్య శాఖ అభ్యంతరాలకు దరఖాస్తులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని డీఎంహెచ్వో అమృతం గురువారం స్పష్టం చేశారు. Pharmacist (Contract Basis) టెంటేటివ్ మెరిట్ లిస్టు https://westgodavari.ap.gov.in/ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేదీ 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.
News January 23, 2026
MHBD: సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై నాయకుల కసరత్తు..!

మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. వార్డుల్లో పట్టున్న నేతల కోసం బీఆర్ఎస్ సైతం సర్వేలు చేస్తున్నారు.


