News October 7, 2025

చింతలపూడి: కరెంటు షాక్‌తో ఒకరు మృతి

image

చింతలపూడి మండలం కంచనగూడెంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ రవి కరెంటు షాక్‌తో మరణించాడు. ట్రాన్స్‌ఫారంలో ఫీజు సరి చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రవి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News January 23, 2026

Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

image

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.

News January 23, 2026

364 పోస్టులకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News January 23, 2026

ఖమ్మం మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు, సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ మూసివేయనున్నారు. తిరిగి మంగళవారం నుండి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కావున రైతులు సెలవు రోజుల్లో తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.