News March 15, 2025

చిట్యాల: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో జరిగింది. రామచంద్రపురం గ్రామానికి చెందిన సూర కుమారస్వామి(44) ఆరేళ్ల క్రితం గుంటూరుపల్లి వలస వెళ్లి నాలుగెకరాల కౌలు సాగు చేస్తున్నాడు. పంట కోసం తెచ్చిన పెట్టుబడి, బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన అప్పు తీరక మనస్తాపంతో ఫిబ్రవరి 19న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 17, 2026

శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 17, 2026

పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

image

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.

News February 17, 2026

సంగారెడ్డి: ఈనెల 21న పాఠశాలల్లో పీటీఎం సమావేశం

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 21న తప్పనిసరిగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని డిఇఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించాలని సూచించారు. చర్చించిన అంశాలను వెంటనే మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.