News December 1, 2025
చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను త్వరితగతిన, చట్టబద్ధంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఇందులో బైక్ దొంగతనం-1, చీటింగ్-1, కుటుంబ/ఇంటి తగాదాలు-9, వేధింపులు-1, భూ తగాదాలు-8, డబ్బు-4, దొంగతనం-1, ఆస్తి-6. ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News February 11, 2026
చిత్తూరు: బీపీఎస్ పథకానికి స్పందన ఏది?

చిత్తూరు జిల్లాలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకానికి తగినంతగా ఆదరణ లభించడం లేదు. ఇప్పటివరకు 300 లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో చిత్తూరు నగరపాలక పరిధిలోనే 200 పైగా ఉన్నాయని తెలుస్తోంది. 2019లో జిల్లాలో ఇందుకోసం సుమారు 2000 దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల ఆదాయం చేకూరింది. ప్రస్తుతం మార్చిలో గడువు ముగియనుండడంతో అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.
News February 11, 2026
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS)లో టీచర్లు నమోదు చేసిన తప్పుల సవరణకు విద్యాశాఖ అనుమతించిందని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు వారి వ్యక్తిగత వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో ఈనెల 14వ తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఐఎస్ డేటాలో హెచ్ఎంలు, టీచర్లు తప్పుడు సమాచారం పొందుపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 11, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


