News April 11, 2024

చిత్తూరు: తల్లిదండ్రుల ఎదుటే మృతి

image

తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఓ యువకుడు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లె(M) రామనపల్లికి చెందిన జయప్ప కుమారుడు యాదగిరి(26) MBA చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇంటికి వచ్చాడు. నిన్న ఉదయం పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులతో ఒంట్లో బాగోలేదని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2025

14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.

News March 20, 2025

చిత్తూరు: KGBVలో ప్రవేశాలు.. అర్హతలు ఇవే

image

చిత్తూరు జిల్లాలోని 8 కేజీబీవీల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమగ్ర శిక్ష APC వెంకటరమణ మాట్లాడుతూ.. అలాగే 7, 8, 9, 10, 12వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ఈనెల 22వ తేదీ నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్, SC, ST, మైనారిటీ, బీపీసీ బాలికలు దరఖాస్తుకు అర్హులని చెప్పారు. ఇతర వివరాలకు 7075159996లో సంప్రదించాలన్నారు.

News March 20, 2025

పుంగనూరు: కోర్టులో లొంగిపోయిన నిందితురాలు

image

పుంగనూరు మండలంలోని కృష్ణాపురంలో రామకృష్ణ హత్యకేసులో నిందితురాలైన రజిని బుధవారం న్యాయవాది శివప్పనాయుడు ద్వారా కోర్టులో లొంగిపోయింది. రికార్డులు పరిశీలించిన అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి వంశీకృష్ణ ఆమెను జుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులైన త్రిలోక, మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెప్పారు.

error: Content is protected !!