News January 22, 2025
చిత్తూరు: మెరిట్ లిస్ట్ విడుదల

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) ప్రాజెక్టులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదలైనట్లు చిత్తూరు DMHO సుధారాణి పేర్కొన్నారు. మెరిట్ జాబితాను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఈనెల 28వ తేదీ లోపు అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు.
Similar News
News February 13, 2025
బైరెడ్డిపల్లి: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన యువకుడు

బైరెడ్డిపల్లికి చెందిన మేస్త్రి కృష్ణప్ప కుమారుడు విశ్వనాథ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్న.. నా భార్య, కూతురును బాగా చూసుకోండి. నేను చనిపోయాక వచ్చే చంద్రన్న బీమా, ఇన్సూరెన్స్ నగదు నేను ఇవ్వాల్సిన అప్పుల వాళ్లకు ఇచ్చి మిగిలిన డబ్బులు నా భార్య బిడ్డలకు ఇవ్వండి’ అని లెటర్లో రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తన తండ్రి తెలిపాడు.
News February 13, 2025
సదుం: జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక

జాతీయ కబడ్డి సీనియర్ మహిళా విభాగం జట్టుకు సదుం కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గుల్జార్, రుక్సానా ఎంపికైనట్టు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి గురువారం తెలిపారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపడంతో వారు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో ఏపీ తరఫున వారు పాల్గొంటారని పేర్కొన్నారు.
News February 13, 2025
చిత్తూరు జిల్లా నేతలకు కీలక పదవులు

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా KP. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.