News November 19, 2025
చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
Similar News
News January 19, 2026
కుప్పం: చెరువులో పడి మహిళ ఆత్మహత్య

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని NTR కాలనీకి చెందిన చలపతి భార్య ప్రభావతమ్మ (54) చీలేపల్లి చెరువులో పడి మృతి చెందింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆమె ఆదివారం చెరువులో పడినట్లు స్థానికులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.


