News November 5, 2025
చివరకు దళారులను ఆశ్రయించాల్సిందేనా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల, తాళ్లపల్లి, గాలిపెల్లిలోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఈసారి గరిష్ఠంగా ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనుండడంతో మిగతా పత్తిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించాల్సిందేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 20, 2026
BREAKING.. KTDM: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి HYD వెళ్తున్న KVR ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది 5 అంబులెన్సులతో వెంటనే చేరుకుని, గాయపడిన 13 మందిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
News January 20, 2026
కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.
News January 20, 2026
బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

HYD బోరాబండలోని రాజీవ్గాంధీనగర్కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.


